సూపర్ స్పెషాలిటీ దవాఖానకు రూ.20కోట్లు మంజూరు
రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి
ఆదిలాబాద్ రూరల్, మే 10: జిల్లా అభివృద్ధి టీఆర్ఎస్ సర్కారుతోనే సాధ్యమవుతుందని రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డిభోజారెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆదిలాబాద్ జిల్లాలో సుమారు రూ.4వేల కోట్లుతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన సూపర్స్పెషాలిటీ దవాఖాన అభివృద్ధికి రూ.20 కోట్లను సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే జోగు రామన్న విజ్ఞప్తి మేరకు విడుదల చేశారని చెప్పారు. అలాగే ఇందులో సుమారు 366 మంది వైద్యులు, ల్యాబ్టెక్నీషియన్ లాంటి సిబ్బందిని నియమించేందుకు అనుమతి మంజూరు చేశారని పేర్కొన్నారు. కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో 50 వేల వైద్య పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించడం అభినందనీయమన్నారు. సుమా రు 60 ఏళ్ల కాంగ్రెస్, బీజేపీ పాలనలో జిల్లా అభి వృద్ధి చెందలేదన్నారు. టీఆర్ఎస్ సర్కారు వచ్చిన ఆరున్నరేళ్లలో జిల్లాలోని మారుమూల ప్రాంతాలు గణనీయమైన అభివృద్ధి సాధించాయని తెలిపా రు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లా డుతూ కరోనా విస్తరిస్తుండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కౌన్సిలర్లు భరత్కుమార్, సంద నర్సింగ్, లక్ష్మణ్, కొండ గణేశ్, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.