మెదక్/ రామాయంపేట, ఏప్రిల్ 27 : ప్రజలకు మరింత సేవ చేసి పునరంకితమవుతామని, సీఎం కేసీఆర్ ఆశయాన్ని నెరవేరుస్తామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం టీఆర్ఎస్ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జెండావిష్కరించారు. రామాయంపేటలోని మెదక్ చౌరస్తాలో గులాబీ జెండాను ఆవిష్కరించారు. ఆయా చోట్ల ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర సాధనే ధ్యేయంగా కంకణబద్ధులై గులాబీ జెండాను చేత పట్టుకొని, 14ఏండ్లు పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన గొప్ప మహనీయుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే మెదక్ జిల్లా కేంద్రంగా ఏర్పడిందని తెలిపారు. కాళేశ్వరం నీటితో మెదక్ జిల్లా సస్యశ్యామలమవుతుందని, ఇప్పటికే హల్దీవాగు ద్వారా నీటిని మంజీరా నదిపై నిర్మించిన చెక్డ్యాంలు పొంగి పొర్లుతున్నాయన్నారు. భవిష్యత్లో సింగూరును కూడా నింపుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి ఉద్యమంలో భాగస్వాములమయ్యామని, అభివృద్ధిలో కూడా భాగస్వాములమవుతున్నామని పేర్కొన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. కార్యక్రమంలో మెదక్, రామాయంపేట మున్సిపల్ చైర్మన్లు చంద్రపాల్, జితేందర్గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.