నేరేడుచర్ల, జూన్ 18 : ప్రస్తుత వానకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతులు వర్షాభా వ పరిస్థితిని గమనించి ఆరుతడి పం టలు సాగు చేయడం ఉత్తమమని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం నేరేడుచర్ల పీఏసీఎస్లో యూ రియా నిల్వలను తనిఖీ చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఆరు లక్షల ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగవుతున్నట్లు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వీటిలో 4.84 లక్షల ఎకరాల్లో వరి, 70 వేల నుంచి 90 వేల ఎకరాల్లో వరకు పత్తి, మిగిలిన ఎకరాల్లో పెసర, కంది, జొన్న సాగు అవుతుందన్నారు. గతేడాది 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాలో వినియోగించామని, ఇప్పుడు 70 వేల మెట్రిక్ టన్నుల అవసరం ఉంటుందని తెలిపారు.
ప్రస్తుతానికి జిల్లాలో 19 వేల మెట్రిక్ టన్నుల యూరియా సిద్ధంగా ఉందన్నారు. జూన్ నుంచి పంట కాలం పూర్తయ్యే వరకు యూరియా సరఫరా అవుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అవసరం మేరకే యూరియా కొనుగోలు చేయాలన్నారు. మండలాన్ని యూనిట్గా తీసుకొని అన్ని మండలాల్లో యూరియా యాప్ ప్రారంభమైందన్నారు. దొడ్డు రకం ధాన్యానికి డిమాండ్ లేనందున రైతులు సన్నరకం పండించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మండల వ్యవసాయ అధికారి జావిద్, సహకార సంఘం సిబ్బంది మధు తదితరులు ఉన్నారు.