నల్లగొండ, ఫిబ్రవరి 13 : వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మొత్తం 23 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా చివరికి 19 మంది బరిలో నిలిచారు. ఈ నెల 11న చేపట్టిన స్క్రూటినీలో తండు ఉపేందర్ అనే అభ్యర్థి నామినేషన్ ఫామ్పై సంతకం పెట్టకపోవటంతో తిరస్కరించారు. గురువారం కోమటిరెడ్డి గోపాల్రెడ్డి, గంగిరెడ్డి కోటిరెడ్డి, బండ నాగరాజు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా చివరికి 19 మంది బరిలో ఉన్నట్లు కలెక్టర్, ఆర్ఓ ఇలా త్రిపాఠి ప్రకటించారు.
ఈ నెల 3న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. మొ త్తం 23 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా స్క్రూటినీ, ఉపసంహరణ అనంతరం 19 మంది బరిలో ఉన్నారు. వారిలో పులి సరోత్తమ్ రెడ్డి(బీజేపీ), లింగిడి వెంకటేశ్వర్లు(ప్రజావాణి పార్టీ), అలుగుబెల్లి నర్సిరెడ్డి, పూల రవీందర్, అర్వ స్వాతి, కంటె సాయన్న, డాక్టర్ కొలిపాక వెంకటస్వామి, గాల్రెడ్డి హర్ష వర్ధన్రెడ్డి, పన్నాల గోపాల్రెడ్డి, ఏలె చంద్రమోహన్, చాలిక చంద్రశేఖర్, జంగిటి కైలాసం, జెట్టి శంకర్, తలకోల పురుషోత్తంరెడ్డి, తాటికొండ వెంకట రాజయ్య, దామెర బాబురావు, పింగిలి శ్రీపాల్రెడ్డి, బంక రాజు, ఎస్ సుందర్రాజు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు.
ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. కొత్తగా ఏర్పడ్డ 12జిల్లాల్లో కలిపి 25,797 మంది ఓటర్లు ఉండగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 984, సూర్యాపేటలో 2,664, నల్లగొండలో 4,683, సిద్దిపేటలో 166 మంది, జనగాం 1002, హనుమకొండ 5,215, వరంగల్ 2,352, మహబూబాబాద్ 1,663, భూపాలపల్లి 329, ములుగు 628, భద్రాద్రి కొత్తగూడెం 2,022, ఖమ్మం 4,089 మంది ఓటర్లు ఉన్నారు. 200 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు ఆర్ఓ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు.