కేతేపల్లి, ఏప్రిల్ 30 : పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో కేతేపల్లి మండలం కొర్లపహాడ్ గ్రామానికి చెందిన వివిధ పార్టీలు, కుల సంఘాల నాయకులు వంద మంది తమ కుటుంబాలతో ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంలో ఆదివారం బీఆర్ఎస్లో చేరారు.
వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, పార్టీలో చేరిన వారిలో మాజీ ఎంపీటీసీ చిర్ర చంద్రయ్య, రావుల చిన్న మల్లయ్య, రావుల లింగరాజు ఉన్నారు. కార్యక్రమంలో కేతేపల్లి జడ్పీటీసీ బొప్పని స్వర్ణలత, బీఆర్ఎస్ అధ్యక్షుడు మారం వెంకట్రెడ్డి, ప్రధాన కార్యదర్శి చిమట వెంకన్న, నాయకులు కొండేటి సైదిరెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.