మన ఊరు-మనబడిలో తొలిదశ పాఠశాలల ఎంపిక
నల్లగొండ జిల్లాలో 517, యాదాద్రి జిల్లాలో 251, సూర్యాపేటలో
329 గుర్తింపు12 అంశాల్లో సకల సౌకర్యాలు కల్పించేలా ప్రణాళిక
ప్రభుత్వ పాఠశాల బలోపేతమే ధ్యేయంగా
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘మన ఊరు-మనబడి’
కార్యాచరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక
కార్యక్రమంలో భాగంగా తొలి
రామగిరి/భువనగిరి అర్బన్, ఫిబ్రవరి 15 : సూర్యాపేట జిల్లాలో 329 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను విద్యా శాఖ ఎంపిక చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఆయా స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంతో పాటు 12 అంశాల్లో మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. సర్కారు ప్రకటనపై ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి వాటిని పూర్తిస్థాయిలో ఆంగ్లమాధ్యమంలో తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు – మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకోసం తొలి విడుతలో పాఠశాలలను ఎంపిక చేసింది. వాటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనుండగా కార్పొరేట్కు దీటుగా మారనున్నాయి
సకల సౌకర్యాలు కల్పించేలా..
మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో 12 అంశాల్లో పాఠశాలలను అభివృద్ధి చేయనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్యకు అనుగుణంగా టాయిలెట్స్, విద్యుత్, తాగునీరు, ఫర్నిచర్ ఏర్పాటు చేస్తారు. పాఠశాల భవనానికి మరమ్మతులు, రంగులు, గ్రీన్చాలక్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. ప్రహరీ, వంటగదులు, అవసరమైన చోట కొత్త గదుల నిర్మాణం, డైనింగ్ హాల్స్, డిజిటల్ తరగతులు అందుబాటులోకి వస్తాయి. గ్రంథాలయాలు, ల్యాబ్స్( సైన్స్, గణితం), కంప్యూటర్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేస్తారు.
నల్లగొండ, యాదాద్రి జిల్లాలో 1.097 పాఠశాలల ఎంపిక
మన ఊరు – మనబడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,097 పాఠశాలలను గుర్తించారు. నల్లగొండ జిల్లాలో 517, యాదాద్రి భువనగిరి జిల్లాలో 251, సూర్యాపేట జిల్లాలో 329 పాఠశాలలను ఎంపిక చేసినట్లు డీఈఓలు బి.భిక్షపతి, కె.నర్సింహ, అశోక్ తెలిపారు.