రామగిరి, జూలై 25 : మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీ కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరానికి ఇంటర్, డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఆదివారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలో ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు నిర్వహించిన పరీక్షకు ఏర్పాటు చేసిన 25 కేంద్రాల్లో 3,903 మంది విద్యార్థులకు 2,886మంది విద్యార్థులు హాజరయ్యారు. 1,017మంది గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా సూర్యాపేటలోని 12కేంద్రాల్లో 1949మందికి 1397మంది హాజరుకాగా 552మంది గైర్హాజరైనట్లు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 8 పరీక్ష కేంద్రాల్లో 1299మందికి 967మంది హాజరవగా, 332 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను నల్లగొండ, సూర్యాపేటలో డీఈఓ భిక్షపతి తనిఖీ చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేలా సూచనలు చేశారు. అంతటా కొవిడ్ నింబంధనలు పాటించారు. నల్లగొండలో గురుకులాల ఆర్సీఓ ఎం.షకీనా, డీసీఓ భిక్షమయ్య, యాదాద్రి భువనగిరిలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి పర్యవేక్షించారు.