సమాజ హితం కోసం పని చేసిన వారిని జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది
స్వరాష్ట్రంలో సాకారమవుతున్న మహనీయుల కలలు
సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
సూర్యాపేటలో ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు
సూర్యాపేటటౌన్, ఫిబ్రవరి 15 : సంత్ సేవాలాల్ స్ఫూర్తిని కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సమాజంలో రుగ్మతలను రూపుమాపిన ధీశాలి సంత్ సేవాలాల్ అని కొనియాడారు. సూర్యాపేటలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన సేవాలాల్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్మించిన ఆలిండియా బంజారా సేవా ట్రస్ట్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. సమాజ హితం కోసం పని చేసిన వారిని సమాజం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. స్వాతంత్య్ర భారతంలో గిరిజనులను పట్టించుకున్న పాలకులు లేరని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తండాలకు గ్రామపంచాయతీ హోదా ఇచ్చి స్థానిక గిరిజనులకే అధికారం అందించామని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతోనే ఇది సాధ్యమైందని తెలిపారు.
సమాజంలో రుగ్మతలను రూపుమాపిన ధీశాలి సంత్ సేవాలాల్ మహరాజ్ అని, ఆయన స్ఫూర్తిని కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం సూర్యాపేటలో నూతనంగా నిర్మించిన బంజారా సేవా ట్రస్టు భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. సమాజహితం కోసం పని చేసిన వారిని సమాజం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందన్నారు. అటువంటి మహనీయుడి జన్మదినం రోజున ఈ భవనాన్ని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. మంచి సమాజం నిర్మాణం కోసం అందరూ చదువుకోవాలనే సంకల్పంతో చేసిన పోరాటం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. ఆయన స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటీష్ సైన్యాన్ని తరిమి కొట్టడంలో గిరిజన జాతి తెగువ మరువలేనిదని చెప్పారు. స్వాతంత్య్రం సాధించి 75సంవత్సరాలు గడిచినప్పటికీ గిరిజనులను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడమే కాకుండా గిరిజనులను సర్పంచులుగా, నాయకులుగా ఎదిగేలా రాజ్యాధికారం ఇచ్చామని తెలిపారు. గతంలో తాగునీటి కోసం తండావాసులు కిలోమీటర్ల మేర వెళ్లి తెచ్చుకునే వారని, విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు పడే వారని, స్వరాష్ట్రంలో ఆ సమస్యలన్నీ తీరాయని చెప్పారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, ప్రముఖ పారిశ్రామికవేత్త మీలా మహదేవ్, ఎంపీపీ కుమారీబాబునాయక్, పాండునాయక్, శాంతాబాయి, ధరావత్ భిక్షం, లచ్చిరాంనాయక్, బాలజీనాయక్, వెంకన్ననాయక్, పూల్సింగ్, వెంకన్న, మంగమ్మ పాల్గొన్నారు.