హాలియా, మార్చి 27 : సంక్షేమ పథకాల అమలులో దేశంలో మన రాష్ట్రమే నంబర్ వన్ అని రామగుండం ఎమ్మెల్యే, ఉప ఎన్నిక హాలియా మున్సిపాలిటీ ఇన్చార్జి కోరుకంటి చందర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ శనివారం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని మొదటి వార్డులో ‘గడపగడపకు గులాబీ దండు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అనాలోచిత విధానాల తెలంగాణ 60సంవత్సరాలు వెనక్కి పోయిందన్నారు. కాంగ్రెస్ 60 ఏళ్ల తప్పిదాలను ఆరేండ్లలోనే సరిచేసి బంగారు తెలంగాణ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే శక్తి టీఆర్ఎస్ పార్టీకే ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవల్లి విజయేందర్రెడ్డి, యడవల్లి మహేందర్రెడ్డి, లింగారెడ్డి, శంకరయ్య, సుధాకర్, వెంకటయ్య, సైదులు, వెంకన్న, అంజత్ఖాన్ పాల్గొన్నారు.