నల్లగొండ : వైద్య రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది అని టీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని బంజారా భవన్ లో మెగా ఆరోగ్య మేళాను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసి సమావేశంలో ఆయన మాట్లాడుతూ..వినూత్నమైన పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మేళాలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. పేద ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసం ఆరోగ్య మేళా రఏర్పాటు చేశామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఉచిత క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి మండలంలో ఆరోగ్య మేళా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కరోనా సమయంలో ఆశావర్కర్ల,ANM సేవలు అమోగం అని ఆయన కొనియాడారు. అనంతరం లయన్స్ క్లబ్ దేవరకొండ వారు అందిస్తున్న పులిగొర ప్యాకేట్స్, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ, మార్కెట్ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మ, ఎంపీపీ వంగల ప్రతాప్ రెడ్డి, జడ్పీటీసీ కేతవత్ బాలు, రైతు బంధు అధ్యక్షుడు సిరందాసు కృష్ణయ్య, డీఎంహెచ్వో కొండల్ రావు, డిప్యూటీ డీఎంహెచ్వో కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.