కనగల్, అక్టోబర్ 12 : నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిదని కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ అన్నారు. మంగళవారం మండలంలోని ఇస్లాంనగర్, తిమ్మన్నగూడెం, శేరి లింగోటం, బాబాసాహెబ్గూడెం గ్రామాల్లో బ్లాక్ ఫ్లాంటేషన్లో భాగంగా రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలను ఆయన పరిశీలించారు. తేలకంటిగూడెంలో పల్లెప్రకృతివనం, వన నర్సరీలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్ల వెంట నాటిన మొక్కలు ఎండిపోకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటాలన్నారు. పల్లెప్రకృతి వనంలో పిచ్చి మొక్కలు లేకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఓ విష్ణువర్ధన్రెడ్డి, ఎంపీడీఓ సోమసుందర్రెడ్డి, ఎంపీఓ ముజావుద్దీన్, సర్పంచులు రమణారెడ్డి, హేమనాయక్, కార్యదర్శులు పెద్దింటి నవీన్రెడ్డి, తలారి యాదయ్య పాల్గొన్నారు.
అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలన
హాలియా : అనుముల మండలం పులిమామిడి, శ్రీనాథపురం, చింతగూడెం, పాలెం గ్రామాల్లో హాలియా-నల్లగొండ రహదారి వెంట రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించారు. పాలెం, చింతగూడెం, శ్రీనాథపురం గ్రామాల్లో రోడ్డు వెంట ఉన్న మొక్కలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఎంపీడీఓ లక్ష్మి, సర్పం చులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
మొక్కలను సంరంక్షించాలి
పెద్దఅడిశర్లపల్లి : మండలంలోని ఘాట్నెమలి పురం వద్ద జాతీయ రహదారి వెంటన నాటిని మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. ఎంపీడీఓ యాదగిరి, ఎంపీఓ మోహన్రెడ్డి, సర్పంచ్ మేడి వెంకటేశ్వర్లు ఉన్నారు.
పెద్దవూర : మండలంలోని వివిధ గ్రామాల్లో అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా నాటిన మెక్కలను కలెక్టర పరిశీలించారు. ఎంపీడీఓ దుబ్బా శ్యమ్, ఎంపీఓ విజయ కుమారి, సర్పంచులు చిన్నలింగారెడ్డి, మల్లారెడ్డి, లింగయ్య పాల్గొన్నారు.