హాలియా, జూలై 23 : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా శనివారం చేపట్టనున్న ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ పిలుపునిచ్చారు. హాలియాలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముక్కోటి వృక్షార్చనలో నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు పాల్గొనాలన్నారు. నాయకులు, ప్రజాప్రతినిధులు నాటిన మొక్క వద్ద సెల్ఫీ తీసుకుని టీఆర్ఎస్ గ్రూప్, గ్రీన్ ఇండియా చాలెంజ్ వెబ్ సైట్లో పోస్ట్ చేయాలని ఆయన కోరారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
వెంకటాద్రి పాలెంలో 2500 మందితో మొక్కల నాటింపు: ఎంపీపీ సరళ
మిర్యాలగూడ రూరల్ : మండలంలోని వెంకటాద్రిపాలెం బృహత్ పల్లె ప్రకృతి వనంలో తలపెట్టిన మెగా హరితహారం విజయవంతం చేయాలని ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వెంకటాద్రిపాలెంలో 2500 మందితో మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ సిబ్బంది, కూలీలు కావాల్సిన గుంతలు తీసి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. సర్పంచులు, ఎంపీటీసీలు, మండల అధికారులు పాల్గొని మెగా హరితహారం విజయవంతం చేయాలని కోరారు. మెగా హరితహారంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు పాల్గొనున్నట్లు తెలిపారు.
భాగస్వామ్యం కావాలి
ముక్కోటి వృక్షార్చనను విజయ వంతం చేయాలని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శిరందాసు లక్ష్మమ్మాకృష్ణయ్య శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపు నిచ్చారు.
మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.