రామగిరి, మే 15 : పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ పాలిసెట్ – 2023 బుధవారం జరుగనుంది. ఈ పరీక్షకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 9,005 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరికోసం 26 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష జరుగనున్నది. నిర్ణీత సమయం కంటే నిమిషం ఆలస్యమైనా అనిమతించమని రీజినల్ కోఆర్డినేటర్, నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ పి.జానకీదేవి తెలిపారు. పరీక్ష కేంద్రాలల్లో మౌలిక వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు.