జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్గౌడ్
బొడ్రాయిబజార్, ఫిబ్రవరి 15 : ధర్మభిక్షం జీవిత పుస్తకంలోని ప్రతి పేజీ ప్రతి మాట ప్రతి అక్షరం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్ అన్నారు. ధర్మభిక్షం శత జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో మంగళవారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. నిజాం నిరంకుశ నవాబుపై తిరుగుబాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ధర్మభిక్షం అని కొనియాడారు. నిజాం పాలనలోనే సూర్యాపేటలో విద్యార్థులకు హాస్టల్ పెట్టి విద్యాబుద్ధులతో పాటు సామాజిక చైతన్యం కల్పించారన్నారు. గీత పనివారల, కార్మికుల సమైక్యతను స్థాపించి స్వచ్ఛమైన ప్రకృతి పానీయమైన కల్లును ఆహార పానీయమని, విటమిన్లు పోషక పదార్థాలు కలిగిన కల్లును రక్షించుకోవాలని ఆయన చేసిన ఉద్యమం నేటి తరానికి ఆదర్శనీయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు రాపర్తి శ్రీనివాస్, అనంతుల యాదగిరి, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి బూర బాలసైదులు, కక్కిరేణి నాగయ్య, గోపగాని గిరి, ఎల్గూరి రమాకిరణ్, షేక్ రఫీ, గట్ల శరణ్, ఇండ్ల సురేశ్, రాపర్తి సైదులు, నాగరాజు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా జై గౌడ ఉద్యమ సంఘం ఆధ్వర్యంలో మినీ ట్యాంక్ బండ్ నుంచి సుమారు 50బైక్లతో ధర్మభిక్షం చౌక్ వరకు ర్యాలీ తీశారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ధర్మభిక్షం శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి సీపీఐ, అఖిల భారత గీత పనివారల సంఘం, మూసీ ప్రాజెక్టు, ఏఐటీయూసీ నాయకులు స్థానిక ధర్మభిక్షం చౌక్ నుంచి భారీగా తరలివెళ్లారు.