ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు
హుజూర్నగర్, ఫిబ్రవరి15 : గిరిజన సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సంత్ సేవాలాల్ జయంత్యుత్సవాల్లో భాగంగా మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన బోగ్ బండార్ హోమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. మఠంపల్లి రైల్వే స్టేషన్కు సేవాలాల్ పేరు పెట్టడం హర్షణీయమన్నారు. గిరిజనుల కోసం హుజూర్నగరలో బంజారా భవన్, మఠంపల్లిలో ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలను నిర్మించినట్లు తెలిపారు. అనంతరం 30మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మఠంపల్లి మోడల్ స్కూల్ కర్రపత్రాన్ని ఆవిష్కరించారు.
అంతకుముందు ఫణిగిరి సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా గుట్ట పరిసరాల్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్రెడ్డి, జడ్పీటీసీలు కొప్పుల సైదిరెడ్డి , జగన్నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వర్రావు, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు గెల్లి రవి, పట్టణాధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి బెల్లకొండ అమర్, కౌన్సిలర్లు ఫణికుమారి, మంగమ్మ, సౌజన్య, శంబయ్య, విజయ్, ఈఓ కొండారెడ్డి, ఆలయ ధర్మకర్తలు రాము, దోసపాటి నరసింహమూర్తి, పద్మ, నరసింహారావు, భాస్కర్, గిరిజన నాయకులు కొండానాయక్, నగేశ్ రాథోడ్, రాములునాయక్, శీను, జలేంద్రుడు, లాలు, అశోక్, షఫీ, మహిళా విభాగం నాయకులు పద్మ, కవిత పాల్గొన్నారు.
చింతలపాలెం : మండలంలోని పీక్లానాయక్తండాలో సేవాలాల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ సేన సాంస్కృతిక ప్రధాన కార్యదర్శి అజ్మీరా వెంకటేశ్వర్లు, అజ్మీరా నాగరాజు, బాదావత్ నాగ, భూక్యా ఉపేందర్, బాదావత్ కృష్ణ, ధరావత్ నాగరాజు, భూక్యా శ్రీరామ్, ధరావత్ కోటేశ్ పాల్గొన్నారు.
కోదాడటౌన్ : పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో గిరిజన నాయకులు బోగ్ బండార్ నిర్వహించారు. కౌన్సిలర్ స్వామినాయక్, బర్మావత్ లచ్చిరాం నాయక్, బట్టు శివాజీ నాయక్, భూక్యా హనుమానాయక్, ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు భూక్యా కోట్యానాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర ఇన్చార్జి సైదానాయక్, లక్ష్మణ్నాయక్, రాము నాయక్ పాల్గొన్నారు.
తుంగతుర్తి : మండలంలోని దేవునిగుట్ట తండా గ్రామంలో గిరిజనులు సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రసాదం పంపిణీ చేశారు. ఆలయ ధర్మకర్త గుగులోతు బాలాజీ, సర్పంచ్ ధీరోజీ, తాటికొండ సీతయ్య, గుడిపాటి సైదులు, పులుసు యాదగిరిగౌడ్, గుండగాని రాములుగౌడ్, దీప్లానాయక్ పాల్గొన్నారు.