నల్లగొండ, జూలై 23 : నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్(ఎన్సీఎపీ)లో భాగంగా వివిధశాఖలు సమన్వయంతో గాలి నాణ్యతా ప్రమాణాల(క్లీన్ ఎయిర్) మెరుగుకు చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాలి నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరిచి స్వచ్ఛమైన, నాణ్యమైన గాలి అందించేందుకు పట్టణంలో విరివిగా మొక్కలు నాటడం, రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ నియంత్రణ, రహదారులపై గుంతల పూడ్చివేత, బ్యాటరీ వాహనాల వినియోగం పెంపుదల, ఇంధన నాణ్యత పరిశీలన, కాలుష్య కారక వాహనాలపై జరిమానా విధించడం వంటి చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఎన్సీఏపీ నోడల్ అధికారి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, సైంటిస్ట్, రీజినల్ డైరెక్టర్ పూర్ణిమ మాట్లాడుతూ ఎన్సీఏపీ కింద తీసుకున్న చర్యల కారణంగా నల్లగొండ పట్టణంలో గాలి నాణ్యతా ప్రమాణాలు మెరుగు పడ్డాయన్నారు. సమావేశంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నల్లగొండ రీజినల్ కార్యాలయం, పర్యావరణం ఇంజినీర్ బి.రాజేందర్, నల్లగొండ ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, జిల్లా రవాణాశాఖ అధికారి సురేశ్రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి వి.వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఎస్ఐ జయనందం, జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారి సతీశ్, ఆర్ఎండ్బీ డిప్యూటీ ఈఈఎం బి.బేగ్ పాల్గొన్నారు.