నిడమనూరు, జూలై 23 : ‘సర్ బ్లాక్ ఫంగస్ మందులు అత్యవసరంగా కావాలి.. ఎక్కడా దొరుకుతలేవు..’ అన్న ట్వీట్కు స్పందించి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తికి దవాఖానకు మందులు పంపించి మానవత్వాన్ని చాటుకున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. తిరుమలగిరి సాగర్ మండలం నేతాపురానికి చెందిన ఎరువుల వ్యాపారి కత్తి గోవిందరెడ్డి మే 8న కరోనా బారిన పడ్డారు. మిర్యాలగూడలోని ప్రైవేటు దవాఖానలో చికిత్స పొంది డిశ్చార్జీ అయిన తర్వాత మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన సికింద్రాబాద్లోని ప్రైవేటు దవాఖానకు తరలించగా వైద్యులు పరీక్షించి బ్లాక్ ఫంగస్గా నిర్ధారించారు. 30న అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయాలని ఆ లోగా పొసకోనజోల్ టాబ్లెట్లను తప్పనిసరిగా వాడాలని సూచించారు. ఆ టాబ్లెట్లు మార్కెట్లో ఎక్కడా అందుబాటులో లేకపోవడంతో గోవిందరెడ్డి బంధువు ఒకరు మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో విన్నవించారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ రూ.8వేల విలువైన టాబ్లెట్లను తన సహాయకుల ద్వారా నేరుగా దవాఖానకు పంపించారు. దీంతో గోవిందరెడ్డి ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డాడు. తనను ఆదుకున్న కేటీఆర్ సాయాన్ని నేటికీ గుర్తు చేసుకుంటున్నాడు.
కేటీఆర్ సాయంతోనే ప్రాణం నిలబడింది..
మంత్రి కేటీఆర్ పంపిన మందులతోనే నా ప్రాణం దక్కింది. ప్రాణాపాయస్థితిలో టాబ్లెట్లు అత్యవసరమన్న వైద్యుల సూచనతో ఎక్కడ ప్రయత్నించినా మందులు దొరకలేదు. ఆ సమయంలో కేటీఆర్ దేవుడిలా నా ప్రాణాలు కాపాడారు. కేటీఆర్ చలువతోనే నేను బ్లాక్ ఫంగస్ నుంచి కోలుకుని ఆరోగ్యంగా ఉన్నా. ఎప్పటిలా ఎరువుల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నా.