రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్
కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 7: కరీంనగర్ నడిబొడ్డున ఉన్న మల్టీపర్సస్ స్కూల్ మైదానంలో చేపడుతున్న పార్కు అభివృద్ధి పనుల్లో భాగంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. సోమవారం ఉదయం ఆయన పార్క్ అభివృద్ధి పనులను పరిశీలించి మాట్లాడారు. రానున్న రోజుల్లో కరీంనగర్ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. స్మార్ట్ సిటీ నిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో అభివృద్ధి పనులు సాగుతున్నాయని చెప్పారు. కొవిడ్ కారణంగా స్మార్ట్సిటీ బోర్డుమీటింగ్ జరగకపోవడంతో అనేక అభివృద్ధి పనులు పెండింగ్లో పడిపోయాయన్నారు. ఈ మీటింగ్లో రూ.300 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆమోదం వస్తుందన్నారు. చరిత్రకు చిహ్నంగా ఉన్న స్కూల్ భవనాన్ని హెరిటేజ్ భవనంగా మార్చి, ఇందులో లైబ్రరీ, సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయన వెంట నగర మేయర్ వై సునీల్రావు, కమిషనర్ క్రాంతి, కార్పొరేటర్లు తదితరులు ఉన్నారు.