ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్గా టి.రవి శంకర్ను నియమించింది కేంద్ర కేబినెట్కు చెందిన నియామకాల కమిటీ. మూడేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం రవి శంకర్.. పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. గత నెల 2వ తేదీన బీపీ కనుంగో రిటైర్ అయిన తర్వాత ఈ డిప్యూటీ గవర్నర్ పోస్ట్ ఖాళీగా ఉంది.
రవి శంకర్ కాకుండా ఇప్పటికే మహేష్ కుమార్ జైన్, మైకేల్ పాత్రా, రాజేశ్వర్ రావు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు గా ఉన్నారు. ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్, రిజర్వ్స్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్, మానిటరీ ఆపరేషన్లలో రవి శంకర్కు మంచి పట్టుంది.