రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా
హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): మేలైన పంటల సాగు, మార్కెటింగ్పై రైతులకు అవగాహన కల్పించడంలో రైతుబంధు కో ఆర్డినేటర్లది కీలకపాత్ర అని రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ప్రతి కో ఆర్డినేటర్ తన పరిధిలోని రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. శుక్రవారం ఆన్లైన్ వేదికగా జరిగిన రైతుబంధు సమితి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు సమితికి ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందించి ఇతర శాఖలకు లింకు చేయాలని కోరారు. వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి జనార్ధన్రెడ్డి మాట్లాడుతూ.. యాసంగిలో భారీ మొత్తంలో ధాన్యం దిగుబడి వస్తుందని తెలిపారు. ఎరువుల వినియోగం తగ్గించేందుకు మే నెలలో పచ్చిరొట్ట ఎరువు సాగుచేసేలా అవగాహన కల్పించాలని కో ఆర్డినేటర్లకు సూచించారు. సమావేశంలో మార్కెటింగ్శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఆర్ధికశాఖ డిప్యూటీ సెక్రటరీ శైలజ తదితరులు పాల్గొన్నారు.