చెన్నై : తమిళ హీరో శింభు వైరల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ శనివారం చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. తీవ్ర ఇన్ఫెక్షన్ బారినపడటంతోనే శింభును ఆస్పత్రికి తరలించారని, అయితే ఆయన కొవిడ్-19తో బాధపడటం లేదని తెలిసింది. శింభు తీవ్ర జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నాడు.
ఇక గత కొద్ది వారాలుగా శింభు వెందు తనిందతుకాడు టైటిల్తో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ మూవీ టీజర్ ఇటీవల విడుదలైంది. గౌతం మీనన్ నిర్ధేశకత్వంలో ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోంది. శింభు సత్వరమే కోలుకోవాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. శింభు చివరిసారిగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో మానాడులో నటించగా నవంబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.