వినాయక్నగర్, జూలై 13: వెస్ట్ వెంకటాపురం కల్వర్టు బ్రిడ్జిని విస్తరించడానికి రూ.1.54 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్మే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం వెస్ట్ వెంకటాపురంలోని బ్రిడ్జిని జోనల్ కమిషనర్ మమత, కార్పొరేటర్ సబితాకిశోర్తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1976లో అప్పటి జనాభాకు అనుగుణంగా బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పెరుగుతున్న జనాభాకనుగుణంగా బ్రిడ్జిని విస్తరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. త్వరలో నిర్మాణ పనులు మొదలు పెడుతామన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మమత, డీసీ నాగమణి, కార్పొరేటర్లు సబితాకిశోర్, రాజ్ జితేంద్రనాథ్, ప్రేంకుమార్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అనిల్కిశోర్ పాల్గొన్నారు.