గాజులరామారం,జూలై 30 : బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సంప్రాదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గాజులరామారం డివిజన్ పరిధిలోని శ్రీరామ్నగర్, చంద్రగిరినగర్లోని రేణుకా ఎల్లమ్మ, పొచమ్మ ఆలయాల్లో వైభవంగా కల్యాణ మహోత్సవం, బోనాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యేతో పాటు స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరిరావు ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు విజయ్రామిరెడ్డి, నాయకులు కొలను శ్రీనివాస్రెడ్డి, రషీద్బేగ్, కమలాకర్, సుంకరి సాయి ప్రతాప్, పరుష శ్రీనివాస్యాదవ్, వార్డు సభ్యులు మసూద్, అజయ్ ప్రసాద్గుప్తా, మల్లేశ్, నాయకులు నవాబ్, ఆంజనేయులు యాదవ్, ప్రభాకర్రెడ్డి, చందు ముదిరాజ్, తిరుపతియాదవ్, తారాసింగ్, మహేశ్, నర్సింగ్రావు, మూసాఖాన్, రమణయ్య పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్,జూలై30: దళితబంధుపై విపక్షాలు చేస్తున్న కుట్రను మానుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సూచించారు. ఎన్ని కుట్రలు చేసినా.. పథకం ఆగే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమన్నారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. దళితబంధు పథకాన్ని ఇతర పార్టీలు అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. ప్రజాభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని అడ్డుకోవడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఎన్నికుట్రలు చేసినా ప్రజాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్ సంకల్పాన్ని ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు.