దుండిగల్,జూలై 26: పేద ప్రజల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అన్నారు. సూరారం డివిజన్ హెచ్ఎంటీ సొసైటీలోని కల్యాణమండపం, ప్రగతినగర్లోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మేకల వెంకటేశం గార్డెన్లో ఏర్పాటు చేసిన రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ఇప్పటికే లక్షా 20వేల పై చిలుకు రేషన్కార్డులు ఉండగా ప్రభుత్వం అదనంగా మరో 8వేల కార్డులను మంజూరు చేసిందన్నారు. పేదప్రజలకు రేషన్కార్డులు అందజేయడం సంతోషంగా ఉందన్నారు.
పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారి జీవనప్రమాణాలను మెరుగుపరచడంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అర్హులైన పేదలకు కొత్తరేషన్ కార్డులను జారీ చేశారన్నారు. రానున్న వారం రోజులపాటు లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగరాజుయాదవ్, నిజాంపేట మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి, కమిషనర్ గోపి, డిప్యూటీ మేయర్ ధన్రాజు, దుండిగల్ మున్సిపల్ చైర్పర్సన్ సుంకరి కృష్ణవేణికృష్ణ, వైస్చైర్మన్ పద్మారావు, కౌన్సిలర్లు శంభీపూర్కృష్ణ, నర్సారెడ్డి శ్రీనివాస్రెడ్డి, జక్కుల కృష్ణాయాదవ్, బాచుపల్లి, కుత్బుల్లాపూర్, గండిమైసమ్మ-దుండిగల్ మండలాలకు చెందిన తాసీల్దార్లు సరిత, మహిపాల్రెడ్డి, భూపాల్లతో పాటు సూరారం డివిజన్ కార్పొరేటర్ సత్యనారాయణ, ఆయా మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు చెందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
జీడిమెట్ల, జూలై 26 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 5743 మంది లబ్ధిదారులను గుర్తించి వారందరికీ ఈ నెలాఖరులోగా నూతనంగా రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు బాలానగర్ ఏఎస్ఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన కుత్బుల్లాపూర్లో విలేకరులతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 109 రేషన్ దుకాణాల పరిధిలో 12344 దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలించి 5743 మంది లబ్ధిదారులుగా గుర్తించినట్లు ఆయన వివరించారు. బాచుపల్లి మండలం 922, దుండిగల్ గండిమైసమ్మ మండలం 984 లబ్ధిదారులు, కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలోని రంగారెడ్డినగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సుభాష్నగర్, గాజులరామారం, జగద్గిరిగుట్ట, చింతల్, సూరారం డివిజన్ల పరిధిలో 4837 మందికి నూతనంగా రేషన్ కార్డులను అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రేషన్ కార్డుల ప్రక్రియ ఈ నెలాఖరులోపు పూర్తి చేసి ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుదారులకు సరుకులను అందజేస్తామని ఏఎస్ఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు.