కుత్బుల్లాపూర్,జూలై25: తాగునీటి కొరతను అధిగమించేందుకు అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వాటర్ వర్క్స్ అధికారులకు సూచించారు. ఆదివారం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వెన్ సాయిటౌన్షిప్, స్టార్ హోమ్స్, శ్రేయటవర్స్లో పర్యటించి అక్కడ నూతనంగా వేసే తాగునీటిపైపులైన్ నిర్మాణ పనులపై కాలనీవాసులతో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగర శివారు ప్రాంతాల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు కోట్ల రూపాయలను వెచ్చించామన్నారు.
భవిష్యత్కాలంలో సైతం తాగునీటికి ఎలాంటి కొరతా లేకుండా చూసేందుకు త్వరలో పైపులైన్ అభివృద్ధి నిర్మాణ పనులను చేపట్టేందుకు అధికారులు తగు ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం కాలనీవాసులతో పలు సమస్యలపై చర్చించి, సకాలంలో వాటిని పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాజిరెడ్డి, నాయకులు జీవన్రెడ్డి, అసోసియేషన్ సభ్యులు కే.నర్సింహారెడ్డి, గిరిధర్రెడ్డి, మురళీధర్రెడ్డి, రామన్ తదితరులు పాల్గొన్నారు.