గాజులరామారం, జూన్ 16 : ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. బుధవారం గాజులరామారం డివిజన్ పరిధిలోని వీనస్ ఎంక్లేవ్లో రూ.49 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు, రూ.24 లక్షలతో జేఎన్ఎన్యూఆర్ఎం నుంచి వీనస్ ఎంక్లేవ్ వరకు భూగర్భ డ్రైనేజీ, రూ.10.20 లక్షలతో వీనస్ రాక్ హైట్స్ నుంచి డబుల్ బెడ్రూం వరకు భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరిరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో నిధులకు కొరత లేకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రతికాలనీ, బస్తీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు.
వరద కష్టాల నుంచి ప్రజలకు విముక్తి..
గాజులరామారం డివిజన్ పరిధిలొని దేవభూమినగర్లో వర్షపు నీటి నాలా పూడికతీత పనులను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరిరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వరద నీరు ఎక్కడా నిలువకుండా మంత్రి కేటీఆర్ సహకారంతో కోట్ల నిధులు వెచ్చించి నాలాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు విజయరామిరెడ్డి, నాయకులు కస్తూరి బాలరాజు, కమలాకర్, పర్ష శ్రీనివాస్ యాదవ్, ఆబిద్, ఇబ్రహీం, చెట్ల వెంకటేశ్, అబ్బు, వార్డు సభ్యులు మసూద్, సింగారం మల్లేశ్, అజయ్ ప్రసాద్గుప్తా, అరిగే సురేశ్, మహిళా అధ్యక్షురాలు సంధ్య, కాలనీవాసులు రాజారెడ్డి, సాయిబాబా, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.