శామీర్పేట, అక్టోబర్ 22 : తెలంగాణలో ప్రజా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్పేట మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం శామీర్పేట, మూడుచింతలపల్లి, తూంకుంట మున్సిపాలిటీలకు చెందిన 46 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డితో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని తెలిపారు. పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్టు మొదలుకుని పండు ముదుసలికి వృద్ధాప్య పింఛన్ వరకు ఏదో ఒక పథకం ద్వారా ప్రజలు లబ్ధిపొందుతున్నారని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు వంటి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కార్యక్రమంలో ఎంపీపీలు ఎల్లూబాయిబాబు, హారిక గౌడ్, జడ్పీటీసీ అనితలాలయ్య, తూంకుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశం, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, తాసీల్దార్లు సురేందర్, రాజేశ్వర్రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు జహీరుద్దీన్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్, రైతుబంధు అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్యయాదవ్, ఎంపీటీసీలు, సర్పంచులు,కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
కీసర : మండల పరిధిలోని రాంపల్లిదాయర మెయిన్రోడ్డు నుంచి బాలవికాస్ సంస్థ వరకు ఎన్ఆర్ఐ ఈజీఎస్ కింద కేటాయించిన రూ.59లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు మంత్రి మల్లారెడ్డి శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాలవికాస్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.
తెలంగాణ వచ్చిన తరువాతే అన్ని ప్రాంతాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ వెంకటేశ్, ఎంపీడీవో పద్మావతి, ఎంపీపీ ఇందిర, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శి సుభాషిణి, మండల పార్టీ అధ్యక్షుడు జె.సుధాకర్రెడ్డి, నాయకులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.