ఘట్కేసర్ రూరల్, సెప్టెంబర్ 27 : సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు యువతను చైతన్య పరిచేందుకు యువజన విభాగం నాయకులు కృషి చేయాలని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. చౌదరిగూడ పంచాయతీ మక్త గ్రామానికి చెందిన కొత్త బాలు యాదవ్ టీఆర్ఎస్ మండల యువజన విభాగం అధ్యక్షుడిగా నియామకం కావటంతో మంత్రి అభినందించారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డెరెక్టర్ పన్నాల కొండల్ రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్, ఉపాధ్యక్షుడు సందీప్ రెడ్డి, సర్పంచ్ వెంకట్ రెడ్డి, సహకార సంఘం డైరెక్టర్ ధర్మారెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు.