దుండిగల్, అక్టోబర్ 23: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మర్రి లక్ష్మ ణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలలో ‘ఇన్నోవేషన్ ఇన్ సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ ఎంబెడ్డెడ్ సిస్టమ్స్’ పేరుతో రెండు రోజులు జరిగిన అంతర్జాతీ య సదస్సు శనివారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్లోని కల్యాణి యూనివర్సిటీ ప్రొఫెసర్ జేకే మండల్ ము ఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆన్లైన్ వేదికగా నిర్వహించిన ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా 228 మంది పరిశోధకులు తమ పరిశోధనా పత్రాలు, నూతన ఆవిష్కరణలను పంపగా.. ఉత్తమమైన వాటిని ఎంపిక చేసిన న్యాయ నిర్ణేతలు బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, న్యూజిలాండ్ వైకాట్ వర్సిటీ ప్రొఫెసర్ డా.విమల్ కుమార్ విశిష్ట అతిథిగా, మహీంద్రా వర్సిటీ ప్రొఫెసర్ డా.గరిమెళ్ల రామ్మూర్తి గౌరవ అతిథిగా హాజరయ్యారు.
సదస్సులో కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, ప్రిన్సిపాల్ డా.కె.శ్రీనివాసరావు పాల్గొనగా, ఎంఎల్ఆర్ఐటీ కళాశాల ఈసీఈ విభాగాధిపతి డా.ఎస్వీఎస్ ప్రసాద్, సదస్సు కన్వీనర్, కో -ఆర్డినేటర్లుగా ఈసీఈ విభాగం ప్రొఫెసర్లు అరుణ్, అనూరాధలు వ్యవహరించారు.