జీడిమెట్ల, జూన్ 10: వర్షాకాలంలో వరద నీరు ఓపెన్ నాలాలో సాఫీగా వెళ్లేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద్ ఆదేశించారు. గురువారం కుత్బుల్లాపూర్ సర్కిల్ రంగారెడ్డినగర్ డివిజన్ పరిధిలోని గాంధీనగర్ పారిశ్రామికవాడ ప్రధాన రోడ్డులో స్థానిక కార్పొరేటర్ బి.విజయ్శేఖర్గౌడ్, టీఎస్ఐఐసీ ఇంజినీరింగ్, జలమండలి అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. ప్రధానంగా రంగారెడ్డినగర్, గాంధీనగర్ పారిశ్రామిక వాడలో వరద నీరు నిలిచే నాలాలను అభివృద్ధి పరచాలని అధికారులను ఆదేశించారు.
వరద ముంపుతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను వెచ్చించి నాలాలను అభివృద్ధి పరుస్తున్నారన్నారు. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం కారణంగా నెలకొన్న ముంపు సమస్యలను ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరిస్తుందన్నారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ డీజెడ్ఎంసీ ఈఈ జ్యోతి, ప్రాజెక్టు ఇంజినీర్ విక్రమ్, గాంధీనగర్ ఐలా చైర్మన్ పి.రాజాన్గౌడ్, ప్రధాన కార్యదర్శి స్వామిగౌడ్, జలమండలి జీఎం శ్రీధర్రెడ్డి, ఈఈ కృష్ణచైతన్య, జీహెచ్ఎంసీ ఏఈ ఆశ, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు గౌసోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్,జూన్10: కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జయభేరి పార్కు బ్యాంకు కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ కాలనీవాసులు గురువారం స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్కు వినతిపత్రాన్ని అందజేశారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ కాలనీల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాల కల్పన కోసం చర్యలు తీసుకుంటామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు.కార్యక్రమంలో 8వ వార్డు ఇన్చార్జి రాజేశ్, కిట్టు, కాలనీవాసులు సూర్యనారాయణ, రామ్గోపాల్, గుప్త, జ్యోతి, సాయిలీల, రవిశంకర్పాల్గొన్నారు.