కీసర, జూలై 13 : గ్రామాల్లో హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ తెలిపారు. మండల పరిధిలోని చీర్యాల్, యాద్గార్పల్లి, నర్సంపలి గ్రామాల్లో మంగళవారం ఎంపీడీఓ పద్మావతి, ఎంపీపీ ఇందిర, ఎంపీఓ మంగతాయారుతో కలిసి వైకుంఠధామం, డంపింగ్యార్డు, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో చాలావరకు పనులు పూర్తి కావడం సంతోషంగా ఉందన్నారు. గ్రామాలన్నీ హరితహారం టార్గెట్ను పూర్తి చేయాలని, ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేయాలన్నారు.హరితహారంలో ప్రజలు భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు తుంగ ధర్మేందర్, పుట్ట రాజుముదిరాజ్, సత్తమ్మ, ఎంపీటీసీలు ప్రమీలఅమరేందర్రెడ్డి, ఉపసర్పంచులు, పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు.