మేడ్చల్, మే11(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా కరోనా రెండో విడత వ్యాక్సిన్కు ఏ మాత్రం కొరతలేదని, ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతామహంతి సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో కలెక్టర్ జూమ్ సమావేశం నిర్వహించారు. కరోనా మొదటి విడత వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇచ్చిన గడువులోగా రెండో విడత వ్యాక్సిన్ అందజేస్తామన్నారు. మున్సిపల్ కమిషనర్లు ప్రతిరోజు దవాఖానలను సందర్శించి సమస్యలను తెలుసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి, శ్యాంసన్, జడ్పీ సీఈవో దేవసహయం, వైద్యాధికారి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్, మే 11: వైద్యాధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించి కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి అన్నారు. మేడ్చల్లోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్తో కలిసి సందర్శించి కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును, ఐసొలేషన్ వార్డును, రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో దేవసహయం, డీఎంహెచ్వో మల్లికార్జున్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ దీపికానర్సింహరెడ్డి, కమిషనర్ సత్యనారాయణరెడ్డి, వైద్యులు పాల్గొన్నారు.