చర్లపల్లి : చర్లపల్లి డివిజన్ పరిధిలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని చక్రీపురంలో చౌరస్తాలో డ్రైనేజీలోని చెత్త, వ్యర్ధాల తొలగింపు పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో శిధిలావస్థకు చెరుకున్న డ్రైనేజీలను గుర్తించి నూతన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు.
డివిజన్ పరిధిలో పారిశుద్ద్య పనులను వేగవంతం చేసి స్వచ్ఛ డివిజన్గా తీర్చిదిదేందుకు చర్యలు తీసుకొవడంతో పాటు డ్రైనేజీ పనులు చేపడుతున్నామని ఆమె పేర్కొన్నారు. డివిజన్లో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా మన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు నాగిళ్ల బాల్రెడ్డి, పాండాల శివకుమార్గౌడ్, విద్యసాగర్, కనకరాజుగౌడ్, శ్రీకాంత్రెడ్డి, శ్రీకాంత్యాదవ్, కొమ్ము సురేశ్, రాఘవరెడ్డి, కనకయ్యలతో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.