సమాజానికి మార్గదర్శకంగా నిలువాలి

మేడ్చల్, జనవరి 26 : యువత తన మేధా సంపతితో నూతన ఆవిష్కరణలు సృష్టించి సమాజానికి దిశ నిర్దేశకులుగా నిలువాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీలోని రాఘవేంద్రనగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన హైడ్రోఫార్మర్ ప్లాంటేషన్ను మంగళవారం రాజశేఖర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో మట్టి లేకుండా నాణ్యమైన ఆకుకూరలు పండించే విధానానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని కొనియాడారు.
కొత్తగా ఆలోచించినప్పుడే అందరికి ఆదర్శంగా మారుతారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమకున్న సృజనాత్మకతను వెలికి తీసినప్పుడే ఇలాంటి ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటాయని తెలిపారు. భవిష్యత్లో మరిన్ని ప్రయోగాలు చేసి పది మందికి దారి చూపాలని సూచించారు. కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ దీపికా నర్సింహా రెడ్డి, కౌన్సిలర్ ఉమా నాగరాజు, నాయకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- అంబానీ గ్యారేజీకి రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్బ్యాడ్జ్
- మ్యాప్మైఇండియా మ్యాప్స్ లో కరోనా టీకా కేంద్రాల సమాచారం
- సుపరిపాలన కోసం క్రిప్టో కరెన్సీ:అనురాగ్ ఠాకూర్
- నీవి ఎల్లప్పుడూ సాస్తీ వ్యాఖ్యలే: తాప్సీపై కంగన ఫైర్
- అక్షర్.. ఆ సన్గ్లాసెస్ ఎక్కడ దొరుకుతాయ్
- హంస వాహనాధీశుడైన శ్రీశైలేశుడు..
- కార్యకర్తలే టీఆర్ఎస్ బలం.. ఎన్నారైల సేవలు మరువలేం
- చిలుక మిస్సింగ్.. నగదు రివార్డు ప్రకటించిన ఓనర్
- అల్లరి నరేష్ ‘నాంది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
- ఈ వారం విడుదలైన 9 సినిమాల్లో విజేత ఎవరు?