సంగారెడ్డి నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): జహీరాబాద్ నియోజకవర్గం వెనకబాటుకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీయే. జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు 12 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించారు. కాంగ్రెస్లో ఉద్దండులుగా పేరొందిన బాగారెడ్డి,గీతారెడ్డి జహీరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. బాగారెడ్డి ఏడు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. 1957 నుంచి 1985 వరకు ఏకబిగిన ఏడుమార్లు బాగారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిపక్ష నేతగా బాగారెడ్డి పనిచేశారు. అలాగే చెన్నారెడ్డి, అంజయ్య, భవనం వెంకట్రామ్, కోట్ల విజయభాస్కర్రెడ్డి ప్రభుత్వంలో బాగారెడ్డి మంత్రిగా పనిచేశారు. జహీరాబాద్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన ఫరీదుద్దీన్, గీతారెడ్డి మంత్రులుగా పనిచేశారు. బాగారెడ్డి, ఫరీదుద్దీన్, గీతారెడ్డి ఉన్నతమైన పదవులు నిర్వహించినా జహీరాబాద్ను సమగ్రంగా అభివృద్ధి చేయలేదు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక జహీరాబాద్ నియోజకవర్గ దశదిశ మారింది. జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారు. 2018లో టీఆర్ఎస్ నుంచి మాణిక్రావు ఎమ్మెల్యే గెలిచిన అనంతరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టించారు.
జహీరాబాద్ నియోజకవర్గ ప్రజల సాగునీటి సమస్యలకు సీఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపారు. జహీరాబాద్నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకంతో గోదావరి జలాలను జహీరాబాద్కు తరలించనున్నారు. రూ.2,653 కోట్ల వ్యయంతో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభమయ్యాయి. ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు మునిపల్లి మండలంలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించారు. జహీరాబాద్ నియోజవకర్గంలోని ఐదు మండలాల్లో ఉన్న 115 గ్రామాల్లో 1,03,259 ఎకరాలకు సాగునీరు అందనున్నది. సంగమేశ్వర ఎత్తిపోతల పథకంలో భాగంగా 12 కాల్వలను నిర్మించనున్నారు. 250 కిలోమీటర్ల మేర కాల్వలను నిర్మించనున్నారు. ఈ కాల్వల ద్వారా 1.03 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. జహీరాబాద్ నియోజకవర్గంలో మిషన్ కాకతీయ ద్వారా రూ.31.04 కోట్లతో 278 చెరువులను పునరుద్ధరించారు. అవి ఎండాకాలంలోనూ నిండుకుండలా తొనికిసలాడుతూ మత్తడి దుంకుతున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేశారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. మంత్రి కేటీఆర్ జహీరాబాద్లోని నిమ్జ్ ఇతర ప్రాంతాల్లో పెద్ద పరిశ్రమలు తరలివచ్చేందుకు చర్యలు చేపట్టారు. మంత్రి హరీశ్ష్రావు జహీరాబాద్ నియోజవకర్గ సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. ప్రభు త్వం మంజూరు చేసిన నిధులతో అభివృద్ధి పను లు పరుగులు పెట్టేలా ఎమ్మెల్యే మాణిక్రావు కృషి చేశారు. సీఎం కేసీఆర్ జహీరాబాద్ నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు జహీరాబాద్ను రెవెన్యూడివిజన్ కేంద్రంగా మార్చారు. జహీరాబాద్లో ఆర్డీవో కార్యాలయంతోపాటు డీఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మొగుడంపల్లిని కొత్త మండలంగా ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ జహీరాబాద్ ము న్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.50 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టారు. జహీరాబాద్లోని 138 పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున అభివృద్ధి నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించారు. ప్రభుత్వం జహీరాబాద్ నియోజకవర్గంలో రూ.112.69 కోట్లతో మిషన్భగీరథ పనులు చేపట్టారు. నియోజకవర్గంలోని మిషన్భగీరథ ద్వారా 69,058 నల్లాకనెక్షన్లు ఇచ్చి ఇంటింటికీ తాగునీటిని ప్రభు త్వం సరఫరా చేస్తున్నది. రూ.70కోట్లకు పైగా నిధులతో ప్రభుత్వం నియోజకవర్గంలో 1400 డబుల్బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి పంపిణీ చేసిం ది. రూ.540 కోట్లతో నిజాంపేట-బీదర్ నాలుగు లేన్ల రహదారిని నిర్మించింది. జహీరాబాద్లో కొత్తగా వంద పడకల దవాఖాన, మాతా, శిశు కేంద్రాన్ని నిర్మించింది. మిర్జాపూర్, కోహీర్ మండలాల్లో కొత్తగా రెండు 50 పడకల దవాఖానను నిర్మించింది. జహీరాబాద్లో పది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేసింది. కోహీర్ మండలం వెంకటాపూర్లో 1009 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూని ట్కు భూసేకరణ ప్రారంభించింది.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ జహీరాబాద్ నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేశారు. నియోజకవర్గంలోని నిమ్జ్లో పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. నిమ్జ్లో వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. పరిశ్రమల ఏర్పాటుతో నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత, యువకులకు ఉపాధి లభిస్తున్నది. 12,680 ఎకరాల్లో నిమ్జ్ ఏర్పాటు అవుతుంది. మంత్రి కేటీఆర్ నిమ్జ్లో తొలి డిఫెన్స్ పరిశ్రమ అయిన వెమ్ టెక్నాలజీ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. మంత్రి కేటీఆర్ పలుమార్లు జహీరాబాద్లో పర్యటించి పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. రూ.1000 కోట్లతో మహీంద్రా పరిశ్రమ విస్తరణకు కూడా శంకుస్థాపన చేశారు. జహీరాబాద్ ఆటోమొబైల్ హబ్గా, ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీ కేంద్రంగా మారింది. నిమ్జ్లో ట్రైటాన్ కంపెనీ రూ.2100 కోట్ల పెట్టుబడులతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ ఏర్పాటు అవుతున్నది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో 25వేల మందికి ఉపాధి లభిస్తుంది. వెమ్ టెక్నాలజీ సంస్థ రూ.1000 కోట్లతో డిఫెన్స్ పరికరాలు తయారీ యూనిట్ను నిర్మిస్తున్నది. వెమ్ టెక్నాలజీ కంపెనీ ఏర్పాటుతో ఆరువేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. జర్మనీకి చెందిన ఆటోమోటివ్ సంస్థ నిమ్జ్లో రూ.1500 కోట్ల పెట్టుబడితో ఆటోమొబైల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో స్థానికంగా దాదాపు 9వేల మందికి ఉపాధి లభించనున్నది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు స్థానికుడు. ఝరాసంఘానికి చెందిన మాణిక్రావు స్థానకంగానే ఉంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. గతంలో జహీరాబాద్ ఎమ్మెల్యేలుగా గెలిచినవారు హైదరాబాద్లో మకాం వేసేవారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ పరుగులు పెట్టాల్సి వచ్చేది. గత ఎమ్మెల్యేలకు భిన్నం గా ఎమ్మెల్యే మాణిక్రావు స్థానికంగానే ప్ర జలకు అందుబాటులో ఊంటూ నియోజకవ ర్గాన్ని అభివృద్ధి చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు సహకారంతో జహీరాబాద్ నియోజకవర్గంలో మునుపెన్నడూ లేనివిధంగా వేలాదికోట్ల రూపాలయ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తాగునీరు, రహదారులు, కరెంటు సమస్యలను తొలగించారు. జహీరాబాద్ మున్సిపాలిటీని అభివృద్ధి చేయటంతోపాటు మౌలికవసతుల కల్పనకు పెద్దపీట వేశారు. ఎమ్మెల్యే మాణిక్రావు రూ.121.40 కోట్ల ఎస్డీఎఫ్ నిధులతో నియోజవకర్గంలో 2478 అభివృద్ధి పనులు చేపట్టారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ల అభివృద్ధి, సంక్షేమానికి ఎమ్మెల్యే మాణిక్రావు చర్యలు తీసుకున్నారు. ప్రభు త్వ సహకారంతో నియోజవకర్గంలోని యువతకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యేలా పెద్దసంఖ్యలో పరిశ్రమల ఏర్పా టు అయ్యేలా చూశారు. ప్రస్తుతం ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న మాణిక్రావుకు అన్నివర్గాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ప్రజాబలంతో మాణిక్రావు మరోమారు ఎమ్మెల్యేగా గెలుపొందటం ఖా యమని ఆయన మద్దతుదారుల, బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.