హుస్నాబాద్, ఏప్రిల్ 8: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ మాజీచైర్మన్ గెల్లు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం హుస్నాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఈనెల 13న జరగనున్న నియోజకవర్గస్థాయి విద్యార్థి, యువజన చైతన్య సద స్సు విజయవంతం కోసం సన్నాహక సమావేశం జరిగింది.
సమావేశంలో గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో ఎన్నో అభివృద్ధి పనులు చేయించడమే కాకుండా కేంద్రం నుంచి నిధులు తెచ్చిన ఘనత వినోద్కుమార్కే చెందుతుందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను కూడా గ్రామస్థాయిలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన పనులు, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలకు వివరించి ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటు వేసేలా ప్రజలను చైతన్యపర్చాలని సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూరంపల్లి పరశురామ్, బొజ్జ హరీశ్, వికాస్యాదవ్, నవీన్రెడ్డి, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.