మెదక్ : మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి.ధర్మారం గ్రామంలో మైసమ్మ గుట్ట వద్ద ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. డి. ధర్మారం గ్రామానికి చెందిన బాజా నందు (28) హత్యకు గురయ్యాడని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. నిందితులను పట్టుకునే వరకు మృతదేహాన్ని కదిలించేది లేదంటూ పోలీసులతో గ్రామస్తులు, కుటుంబీకులు వాగ్వాదానికి దిగారు.
గ్రామస్తులు మృతదేహం వద్దకు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రామాయంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ రాజేష్ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇద్దరు అనుమానితులను పోలీస్ స్టేషన్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.