మెదక్, మే 1 (నమస్తే తెలంగాణ): భవన, ఇతర నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల కోసం నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక బాలుర జూనియర్ కళాశాలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 2న నర్సాపూర్ క్రాస్రోడ్లోని వీ-మార్ట్ దగ్గర, 3న చిన్న శంకరంపేట మండలం గవ్వలపల్లి క్రాస్రోడ్ లోన్ సెయింట్ మైత్రీ సూల్, 4న తూప్రాన్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో హెల్త్ కేర్ శిబిరాలను నిర్వహిస్తున్నామని, కార్మికులు తమవెంట లేబర్ కార్డు, ఆధార్ కార్డుతో శిబిరాలకు వచ్చి రక్త పరీక్షలు, ఈసీజీ, వినికిడి లోపం వంటి వైద్య పరీక్షలు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, సహాయ లేబర్ అధికారి రాజు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.