సంగారెడ్డి అర్బన్, మార్చి 26: సమాజంలో మన నుంచే మార్పు మొదలు కావాలని, మహిళను ద్వితీయ శ్రేణి పౌరురాలిగా చూడొద్దని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య సూ చించారు. ఆదివారం సంగారెడ్డిలోని తెలంగాణ గిరిజన గురుకుల న్యాయ కళాశాలలో మహిళలపై నేరాలు- నేర న్యాయ వ్యవస్థ – సవాళ్లు, పరిష్కా ర మార్గాలు అనే అంశాలపై సదస్సు నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులపై అవగాహన ఉండాలన్నారు. ఆత్మ గౌరవంతో ప్రతిఒక్కరూ జీవించడానికి కృషి చేస్తూ రాజ్యాంగబద్దం గా అందరికీ సమాన హక్కులు ఉంటాయన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్రెడ్డి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఏదో ఒక సమయంలో నేరానికి గురికాక తప్పదని, స్త్రీని ఆది పరాశక్తిగా నామమాత్రానికే అంటామని, కుటుంబంలో మహిళలు వివక్షతకు గురవుతున్నారన్నారు. చట్టంలో వచ్చిన మార్పులను అర్థం చేసుకోవాలని, నేరాలు జరిగినప్పుడు సమాజంలో వచ్చిన మార్పులతోనే స్త్రీలకు రక్షణ, న్యాయ సహాయం అందించేందుకు భరోసా, సఖీ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. బాధిత మహిళలు న్యాయ సహాయం పొందేందుకు ఈ కేంద్రాలను ఉపయోగించుకోవాలన్నా రు. కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ న్యాయశాఖ డీమ్, ప్రొఫెసర్ గాలి వినోద్, గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీ డిప్యూటీ కార్యదర్శి, డిప్యూటీ కలెక్టర్ జగదీశ్రెడ్డి, న్యాయకళాశాల ప్రిన్సిపాల్ కృష్ణానాయక్, వైస్ ప్రిన్సిపాల్ రూత్ కమలిని, అధ్యాపకులు పాల్గొన్నారు.