నర్సాపూర్ : ప్రజలకు సేవ చేయడానికి అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి(MLA Sunitha lakshmareddy) పేర్కొన్నారు. శుక్రవారం నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి క్యాంప్ కార్యాలయం వేదికగా ఉపయోగపడుతుందని వెల్లడించారు.
ప్రజలకు అందుబాటులో ఉంటు ప్రజాసమస్యలను పరిష్కరించాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) గతంలో క్యాంప్ కార్యాలయాలను నిర్మించారని తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గంలో పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి కృషి చేస్తామని వెల్లడించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) అభ్యర్థి విజయానికి కష్టపడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్, మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.