Road Accident | గజ్వేల్, మార్చి 23 : అతివేగంగా దూసుకొచ్చిన లారీ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం అహ్మదీపూర్ సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.
స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గజ్వేల్ పట్టణ సమీపంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీ బంజేరుపల్లి గ్రామానికి చెందిన సుతారి కిష్టయ్య, సత్తమ్మ దంపతులు ఇద్దరు బైకుపై వెళ్తుండగా సిద్దిపేట నుండి గజ్వేల్ వైపు వస్తున్న లారీ అతివేగంగా వారిని ఢీకొట్టింది. సత్తవ్వ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదంలో భర్త కిష్టయ్య రెండు కాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న కిష్టయ్యను 108 అంబులెన్స్లో గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కిష్టయ్యకు ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని గాంధీ దవాఖానకు తరలించారు.