సిద్దిపేట టౌన్, ఫిబ్రవరి 2: దివ్యాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ ఇస్తున్న రూ.4వేల పెన్షన్ కంటే అదనంగా మరో రెండు వేలు కలిపి రూ.6 వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఇవ్వడం లేదని ఆసంఘం నేతలు అశోక్, నర్సింహులు, లచ్చయ్య, యాదగిరి రమేశ్, పరశురాములు, రాములు ప్రశ్నించారు.
సిద్దిపేట పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం నిరసన తెలిపారు. దివ్యాంగుల పట్ల చిన్నచూపు వద్దని, ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.