మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పటాన్చెరు మండలం ఇస్నాపూర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను చాలా బాగా అభివృద్ధి చేశారని రాష్ట్ర విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ విజయలక్ష్మి కితాబిచ్చారు. ఇస్నాపూర్ పాఠశాలను ఆమె గురువారం సందర్శించారు. పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులు, విద్యార్థులకు సమకూర్చిన సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇస్నాపూర్ పాఠశాలను మన ‘ఊరు-మన బడి’లో మోడల్గా తీసుకుంటామని చెప్పారు.
-పటాన్చెరు, మే 25
– రాష్ట్ర విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ విజయలక్ష్మి
పటాన్చెరు, మే 25: మన ఊరు..మనబడిలో భాగంగా పటాన్చెరు మండలం ఇస్నాపూర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను బాగా అభివృద్ధి చేశారని, దీన్ని మోడల్ స్కూల్గా తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ విజయలక్ష్మి అన్నారు. గురువారం ఇస్నాపూర్ ప్రభుత్వ పాఠశాలను ఆమె సందర్శించారు. పాఠశాలలో చేసిన అభివృద్ధి పనులు, విద్యార్థులకు సమకూర్చిన సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు..
మనబడి కార్యక్రమంలో తీసుకుంటున్న చర్యలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కావాల్సిన అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి ఆర్థిక ఇబ్బందులకు గురి కావద్దని సూచించారు. ఆమెతో సంగారెడ్డి డీఈవో వెంకటేశ్వర్లు, సీఎంవో వెంకటేశం, ఎంఈవో పీపీ రాథోడ్, సర్పంచ్ గడ్డం బాలమణి, ఎంపీటీసీలు గడ్డం శ్రీశైలం, అంజిరెడ్డి, ఉప సర్పంచ్ శోభా కృష్ణారెడ్డి, హెచ్ఎం, ఉపాధ్యాయులు ఉన్నారు.