నారాయణఖేడ్, నవంబర్ 8: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి బుధవారం నామినేషన్ను దాఖలు చేశారు. రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేయగా, ఒక సెట్ను భూపాల్రెడ్డి స్వయంగా రిటర్నింగ్ అధికారి వెంకటేశ్కు అందజేయగా, మరో సెట్ నామినేషన్ను ఎమ్మెల్యే తనయుడు మహారెడ్డి రోషన్రెడ్డి దాఖలు చేశారు. మంగళవారం వరకు కేవలం ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలు కాగా బుధవారం ఒక్కరోజే దాఖలైన ఐదు సెట్ల నామినేషన్లతో మొత్తం ఆరు నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో వెంకటేశ్ తెలిపారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ తరఫున సురేశ్ శెట్కార్; బీఎస్పీ తరఫున మహ్మద్ అల్లాఉద్దీన్లతో పాటు పుటాల విఠల్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్లను దాఖలు చేసినట్లు వెల్లడించారు.
పెద్దశంకరంపేట, నవంబర్ 8 : బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే భూపాల్రెడ్డి నామినేషన్ వేస్తున్న సందర్భంగా బుధవారం పెద్దశంకరంపేట మండలం నుంచి బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళీపంతులు, ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజుల ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు పలు వాహనాల్లో తరలివెళ్లారు. మరోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమన్నారు. ఖేడ్కు బయలు దేరేముందు ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టణంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.
మనూరు, నవంబర్ 8: నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి నామినేషన్కు మనూరు మండల పరిధిలోని పలు గ్రామాల నుంచి బుధవారం భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు తరలి వెళ్లారు. ర్యాలీ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
నాగల్గిద్ద/ నిజాంపేట్ 8 : నారాయణఖేడ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే భూపాల్రెడ్డి బుధవారం నామినేషన్ వేయడంతో మండలంలో అన్ని గ్రామాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు ఉప్పెనలా తరలివెళ్లారు. ఎమ్మెల్యే భూపాల్రెడ్డి భారీ మెజార్టీ ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు
కంగ్టి, నవంబర్ 8 : కంగ్టి మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బుధవారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే అభ్యర్థి భూపాల్రెడ్డి నామినేషన్ దాఖలు చేయడంతో భారిగా తరలి వెళ్లారు. భూపాల్రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
సిర్గాపూర్, నవంబర్ 8 : మండల కేంద్రమైన సిర్గాపూర్ కు చెందిన మైనార్టీ యువత ఫారూఖ్, సాజిద్,అబ్బు తదితరులు మండలాధ్యక్షుడు సంజీవరావు, యాదవరావు ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ చేరారు. ఈమేరకు వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. రూప్లా తండా, సూర్యతండాలో ఎమ్మెల్యే ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మహిపాల్రెడ్డి, జడ్పీటీసీ రాఘవరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు ఉన్నారు.
అందోల్/ రేగోడ్/అల్లాదుర్గం, నవంబర్ 8 : మండలంలోని ఆర్ఇటిక్యాల గ్రామంలో బుధవారం అందోల్ బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్కు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేశారు. భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మండల ప్రధాన కార్యదర్శి, సర్పంచ్ సుంకె రమేశ్ నాయకులు సాయిబాబా, అంజన్న పటేల్ పాల్గొన్నారు. అల్లాదుర్గంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలోని స్వామివారిని అందోల్ బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు ప్రవీణ్ శర్మ నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. ఆయన వెంట ఎంపీపీ అనిల్కుమార్రెడ్డి, దక్షిణ మధ్య రైల్వేబోర్డు మెంబర్ కాశీనాథ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింహులు, మాజీ అధ్యక్షుడు బ్రహ్మం, సర్పంచ్ అంజియాదవ్, ఎంపీటీసీ దశరథ్, సాయికుమార్, రవి, రమేశ్, బస్వరాజ్, తదితరులు ఉన్నారు.
అందోల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా చంటి క్రాంతికిరణ్ బుధవారం నామినేషన్ కార్యక్రమానికి అల్లాదుర్గం మండలం నుంచి బీఆర్ఎస్ నాయకులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. అంతకు ముందు అల్లాదుర్గంలోని వేంకటేశ్వర ఆలయంలో స్వామి వారి ముందు నామినేషన్ పత్రాలు ఉంచి క్రాంతికిరణ్ ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట ఎంపీపీ అనిల్ కుమార్రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ కాశీనాథ్, బీఆర్ఎస్ అధ్యక్షుడు నర్సింహులు, మాజీ అధ్యక్షుడు బ్రహ్మం, సర్పంచ్ అంజియాదవ్, ఎంపీటీసీ దశరథ్, నాయకులు ఉన్నారు.
అందోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని కాయిదంపల్లి సర్పంచ్ యాటకారి బేతయ్య అన్నారు. బుధవారం మండంలోని కాయిదంపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్కు మద్దతుగా నాయకులు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు,అభివృద్ధ్దిని ప్రజలకు వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్కు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నాయకులు అంజయ్య,భాగయ్య, కేశయ్య, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణలో భాగంగా ఆరో రోజు బుధవారం 5 నామినేషన్లు వచ్చినట్లు రిటర్నింగ్ అధికారి పాండు తెలిపారు. బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి, అల్లాదుర్గం ఎంపీపీ అనిల్రెడ్డి, సీనియర్ నాయకులు జైపాల్రెడ్డి, లింగాగౌడ్లతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఒక సెట్ నామినేషన్ సమర్పించారు. అంతకు ముందు జోగిపేటలో జోగినాథస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలను పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర నాయకుడు రాహుల్కిరణ్, జైపాల్రెడ్డి, మాజీ ఎంపీపీ కాశీనాథ్, నాయకులు వీరభద్రరావు, సాయికుమార్ క్రాంతికిరణ్ తరపున మరో సెట్ నామినేషన్ వేశారు. బీఎస్పీ తరపున ముప్పారం ప్రకాశ్, బీపీపీ తరపున కాసాల పవన్, మరో ఇద్దరు స్వతంత్రులుగా నామినేషన్లు వేశారు. రిటర్నింగ్ కార్యాలయం వద్ద ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా నోడల్ అధికారి బాలాజీ ఆధ్వర్యంలో సీఐ నాగరాజు, ఎస్సై అరుణ్కుమార్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
అందోల్, నవంబర్ 8 : ఈ నెల 30న జరుగనున్న ఎన్నికల్లో స్థానిక అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా పంపాలని అందుకు మనమందరం సమిష్టిగా పనిచేయాలని అందోల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ సతీమణి పద్మావతి అన్నారు. బుధవారం అందోల్లోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందరం సమిష్టిగా పనిచేసి స్థానిక అభ్యర్థిని గెలిపించుకుందాం అంటూ.. ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీన్, కౌన్సిలర్లు భవానీనాగరత్నంగౌడ్, ధనలక్ష్మీఅనిల్, భాగ్యలక్ష్మి, నాయకులు శ్రీధర్, వెంకటేశం, శంకర్, మహేశ్యాదవ్, సుధాకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.