తన హయాంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, మరోసారి ప్రజలు దీవించి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్కుమార్ అన్నారు. గురువారం అక్కన్నపేట మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుస్నాబాద్ నియోజకవర్గంలో మౌలిక వసతులు, సాగునీటి ప్రాజెక్ట్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును విజయవంతంగా కొనసాగించామన్నారు.గిరిజన తండాలను, అనుబంధ పల్లెలను గ్రామ పంచాయతీలుగా చేయడంతో స్వయం పాలన సాగుతున్నదని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయిందని, ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఉంటుందని చెప్పారు.
అక్కన్నపేట, అక్టోబర్ 19 : తెలంగాణలో 60 ఏండ్లలో సాధించని అభివృద్ధిని బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిడేండ్లలో చేసి ప్రగతి, అభివృద్ధిని వివరిస్తూ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ దూసుకుపోతున్నారు. గురువారం హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలోని మంచినీళ్లబండ, కేశవాపూర్, గొల్లపల్లి, టేకులతండా, మల్లంపల్లి, మోత్కులపల్లి, పెద్దతండా, పంజాగుట్టతండా చౌటపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. మౌలిక వసతులు, సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును విజయవంతంగా కొనసాగించామన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు కొత్త పంచాయతీలను ఏర్పాటు చేశామన్నారు. దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న గిరిజనుల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారన్నారు. గిరిజన తండాలు, అనుబంధ పల్లెలను పంచాయతీలుగా చేయడంతో స్వయం పాలన సాగుతున్నదన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని, ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. గౌరవెల్లి ద్వారా 1.06 లక్షల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. అభివృద్ధిని నిరంతరంగా కొనసాగించేందుకు ప్రజలు తిరిగి బీఆర్ఎస్కు పట్టం కట్టాలన్నారు.
ఎన్నికలప్పుడు వచ్చే ప్రతిపక్షాలకు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాల్లో బతుకమ్మలు, మంగళహారతులు, కోలాటాలు, డప్పు చప్పుళ్లు, నృత్యాలు డీజే పాటలు, లంబాడీల వేషధారణ.. జై తెలంగాణ.. జై కేసీఆర్.. కారు గుర్తుకే మా ఓటు అంటూ నినాదాలు చేశారు. ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్కు ఘననీరాజనం పలుకడంతో ప్రచారం ఉత్సాహంగా ముందుకు సాగింది. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలు అడుగడుగునా అండగా నిలిచారు. మళ్లీ కేసీఆర్ సీఎం.. నువ్వే మా ఎమ్మెల్యే అంటూ ఆశీర్వదించారు. మహిళలు బొట్టు పెట్టి మంగళహారతులతో
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, ఎంపీపీ మాలోత్ లక్ష్మీబీలూనాయక్, జడ్పీటీసీ భూక్యా మంగ, మండల ఇన్చార్జిలు మ్యాక నారాయణ, కాసర్ల అశోక్బాబు, లింగాల సాయన్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, మాజీ జడ్పీటీసీ మాలోత్ బీలూనాయక్, రైతుబంధు మండల అధ్యక్షుడు కందుల రాంరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.