పటాన్చెరు/జిన్నారం, జనవరి 27: కర్ధనూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శనివారం పటాన్చెరు మండలం కర్ధనూర్ గ్రామంలో రూ. కోటి 14 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కర్ధనూర్ గ్రా మాన్ని రాష్ట్రస్థాయిలో ఉత్తమ పంచాయతీగా అభివృద్ధి చేశామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుష్మాశ్రీవేణుగోపాల్రెడ్డి, జడ్పీటీసీ సుప్రజావెంకట్రెడ్డి, గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మీసత్యనారాయణ, ఎంపీటీసీ నాగజ్యోతీలక్ష్మణ్, పంచాయతీరాజ్ డీఈ సురేశ్, వ్యవసా య మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్కుమార్, బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు పాండు, ఉప సర్పంచ్ వడ్డే కుమార్ పాల్గొన్నారు.
రైతులకు అండగా ఉంటా..
రైతులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శనివారం పటాన్చెరు మండలం ముత్తంగిలో రూ. 60లక్షలతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనాన్ని ప్రారం భించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉపేందర్ముదిరాజ్, మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్గౌడ్, వైస్ ఎంపీపీ స్వప్నశ్రీనివాస్, పీఎస్సీఎస్ అధ్యక్షుడు భిక్షపతి, రామకృష్ణముదిరాజ్ పాల్గొన్నారు. జిన్నారం మండలం లక్ష్మీపతిగూడెంలో ఫిబ్రవరి 22న జరిగే ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠ కరపత్రాన్ని జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, సర్పంచ్ లావణ్యాజీవన్, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే తన నివాసంలో ఆవిష్కరించారు.