పటాన్చెరు టౌన్, మే 25 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ రంగానికి కీలకంగా మారిన సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికుల సంక్షేమానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. త్వరలోనే వెయ్యి గజాల స్థలం కేటాయింపుతో పాటు భవన నిర్మాణానికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ దవాఖాన సమీపంలో నియోజకవర్గ స్థాయి సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సెంట్రింగ్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడు తూ.. భవన నిర్మాణ రంగంలో సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికుల పాత్ర చాలా కీలకమన్నారు. కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ పనులు చేయాలని సూచించారు. అసోసియేషన్కు స్థలం కేటాయించి భవనం నిర్మించాలని కోరడంతో,త్వరలోనే వెయ్యి గజాల స్థలం కేటాయించి భవన నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు, లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
ప్రతి కార్మికుడికి బీమా కల్పించేందుకు కృషిచేస్తానని భరోసా ఇచ్చారు. అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానంద్, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్కుమార్, అమీన్పూర్ మాజీ వైస్ చైర్మన్ నరసింహాగౌడ్, నాయకులు దశరథ్రెడ్డి, నర్రా భిక్షపతి, శ్రీధర్చారి, పృథ్వీరాజ్, రాజు, అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు యాదగిరి, అధ్యక్షుడు కృష్ణ, ప్రధాన కార్యదర్శ జంగయ్య, కాంట్రాక్టర్లు, కార్మికులు పాల్గొన్నారు.