సిర్గాపూర్, జనవరి 4: సంగారెడ్డి జిల్లాలోని మధ్యతరహా నల్లవాగు ప్రాజెక్టు ద్వారా యాసంగి పంట సాగుకు నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి గురువారం సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా స్థానిక రైతుల సంప్రదాయ పద్ధతి ప్రకారంగా మొదటగా ఎమ్మెల్యే, ప్రాజెక్టులోని జలాలకు (గంగమ్మ తల్లికి) ప్రత్యేక పూజలు చేసి తెప్పను వదిలారు. అనంతరం స్థానిక ప్రధాన కాల్వల ద్వారా నీటిని వదిలారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నీటిని వృథా చేయకుండా పంటలకు మాత్రమే వదులుకోవాలని
సూచించారు.
నీటిపారుదల శాఖ డీఈఈ పవన్కుమార్ మాట్లాడుతూ ప్రాజెక్టు కాల్వల మరమ్మతుల కారణంగా ఈ యాసంగిలో 940ఎకరాల పంటల సాగుకు నీటి పారుదల చేస్తున్నామని తెలిపారు. ఇందులో గోసాయిపల్లి, ఎమర్జెన్సీ కాల్వ కింద 60 ఎకరాల వరి పంట, మిగతా ఆరుతడి పంటలు సాగునీటిని అందిస్తామన్నారు. కార్యక్రమంలో డీఈఈ పవన్కుమార్, ఏఈఈ సూర్యకాంత్, రవి సిబ్బంది, రైతులు గ్రామస్తులు ఉన్నారు.