సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 7 : సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓటరు తుది జాబితాను ప్రకటించారు. జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్లు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఓటరు జాబితాను ప్రదర్శించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఈనెల ఒకటి నాటికి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఓటర్ల వివరాలు ఈవిధంగా ఉన్నాయి.
మెదక్ జిల్లా ఓటర్లు 4,51,225
మెదక్, జనవరి 7(నమస్తే తెలంగాణ) : భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, సూచనల ప్రకారం ప్రత్యేక సవరణ 2025లో భాగంగా మెదక్ జిల్లా పరిధిలోని మెదక్-34, నర్సాపూర్- 37 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ విడుదల చేశారు. 34-మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో 278 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, 1,04,917 మంది పురుషులు, 1,15,987 మంది మహిళలు, 04 మంది థర్డ్ జెండర్ కలిపి మొత్తం 2,20,908 సాధారణ ఓటర్లు ఉన్నారు. వీరిలో 9 మంది పురుషులు, 1 మహిళ ఎన్ఆర్ఐ ఓటర్లు 10 మంది ఉన్నారని, సర్వీస్ ఓటర్లలో 87 మంది పురుషులు, 2 మహిళలు కలిపి 89 మంది ఉన్నారు. 37-నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 308 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, 1,11,611 మంది పురుషులు, 1,18,701 మంది మహిళలు, 5 మంది థర్డ్జెండర్ కలిపి మొత్తం 2,30,317 సాధారణ ఓటర్లు ఉన్నారు.
వీరిలో ఒకరు పురుష ఎన్ఆర్ఐ ఓటరు ఉండగా, సర్వీస్ ఓటర్లలో 36 మంది పురుషులు, 2 మహిళలు కలిపి 38 మంది ఉన్నారు. మొత్తం జిల్లా వారీగా 2,16,528 మంది పురుషులు, 2,34,688 మంది మహిళలు, 9 మంది థర్డ్ జెండర్ కలిపి 4,51,225 సాధారణ ఓటర్లు ఉన్నారు. వీరిలో 10 మంది పురుషులు, 1 మహిళ కలిపి 11 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నారు. సర్వీస్ ఓటర్లలో 123 మంది పురుషులు, 4 మంది మహిళలు కలిపి 127 మంది ఉన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదేశాల ప్రకారంపై ఓటర్ల జాబితాలను సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో, ఈఆర్వో కార్యాలయాల్లో, ఏఈఆర్వో, తహసీల్ కార్యాలయాల్లో, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరేట్లో ప్రచురించారు. ఓటర్లు తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందని ధృవీకరించుకోవాలని, ఏవైనా పొరపాట్లు లేదా మార్పులు అవసరమైతే సంబంధిత బూత్ స్థాయి అధికారులను సంప్రదించాలని లేదా అధికారిక ఎన్నికల వెబ్ సైట్ను సందర్శించాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి రాహుల్రాజ్ సూచించారు.