పెద్దశంకరంపేట, ఫిబ్రవరి 15 : రాష్ట్ర గీతాపారిశ్రామిక సహకార సంస్థ మాజీ చైర్మన్ విగ్రాం రామాగౌడ్ పెద్దశంకరంపేట మండలానికి చేసిన సేవలు చిరస్మరణీయమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. బుధవారం 161వ జాతీయ రహదారిపై రేణుకా ఎల్లమ్మ ఆలయం ఆవరణలో విగ్రాం వేణుగోపాల్గౌడ్ ఏర్పాటు చేసిన రామాగౌడ్ విగ్రహాన్ని బుధవారం ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఆవిష్కరిం చా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్దశంకరంపేట మండలానికి రామాగౌడ్ చేసిన సేవలను కొనియాడారు. రామాగౌడ్ 40 ఏండ్ల రాజకీయ జీవితంలో మండల, ఉమ్మడి జిల్లా, రాష్ట్రస్థాయిలో ఎన్నో పదవులు చేపట్టి, ఆ పదవులకే వన్నె తెచ్చారన్నారు.
ఏ పదవి అలంకరించినా ప్రజలతో మమేకమై ఉం డేవారన్నారు. పెద్దశంకరంపేట పట్టణం లో రేణుకా ఎల్లమ్మ, వేంకటేశ్వర ఆలయా లు నిర్మించారని గుర్తుచేశారు. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులతోపాటు ఇతర మండలాల నుంచి ప్రజలు, ప్రజాప్రతినిధులు హాజరై రామాగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళీపంతులు, సర్పంచ్ సత్యనారాయణ, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కుంట్ల రాములు, ఎంపీటీసీ వీణాసుభాష్గౌడ్, రైతుబంధు మండల అధ్యక్షుడు సురేశ్గౌడ్, స్థానిక నాయకుడు దాదిగారి గంగాధర్తోపాటు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే భూపాల్రెడ్డి
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. పెద్దశంకరంపేట మండలంలోని ఆయా గ్రా మాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయని, ప్రస్తుత ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నదన్నారు. గోపని వెంకటాపురం గ్రామంలో రూ. 20లక్షలు (ఎస్డీఎఫ్ నిధులు), రూ. 5లక్షలతో(ఉపాధిహామీ) సీసీరోడ్డు నిర్మాణ పనులు, టెంకటి గ్రామంలో రూ.20 లక్షలు (ఎస్డీఎఫ్ నిధులు), రూ. 5లక్షలతో (ఉపాధిహామీ) సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. గోపని వెంకటాపురం గ్రామంలో హైమాస్ట్ లైట్లను ప్రారంభిం చారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్పర్సన్ సువర్ణ్ణా అంజయ్య, నాయకులు పున్నయ్య, రామచందర్ ఉన్నారు